జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

BJP Leader UP CM Yogi Adityanath, CM Yogi Adityanath Participated in GHMC Elections Campaign, GHMC, GHMC Elections, GHMC Elections 2020, GHMC Elections Campaign, GHMC Elections Latest News, GHMC Elections News, GHMC Elections Updates, Greater Hyderabad Municipal Corporation, Mango News, UP CM Yogi Adityanath, UP CM Yogi Adityanath in GHMC Elections Campaign, UP CM Yogi Adityanath Participated in GHMC Elections

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారం తుదిదశకు చేరుకోవడంతో బీజేపీ రాష్ట్రస్థాయి నాయకులతో పాటుగా జాతీయ నేతలు కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. అందులో భాగంగా బీజేపీ కీలక నేత, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ రోజు హైదరాబాద్ నగరానికి విచ్చేశారు. హైదరాబాద్ చేరుకున్న సీఎం యోగి ఆదిత్యనాథ్ కు పలువురు బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముందుగా కూకట్ పల్లి, శేరిలింగంపల్లి అసెంబ్లీ నియాజకవర్గాల పరిధిలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ఉషా ముళ్ళపూడి రోడ్, జీడిమెట్ల నుంచి తిరుమల బేకరీ ఎదురుగా ఆల్విన్ క్రాస్ రోడ్ వరకు రోడ్ షో నిర్వహిస్తున్నారు. అనంతరం హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని శాలిబండ, లాల్ దర్వాజా ప్రాంతంలోగల అల్కా థియేటర్ గ్రౌండ్ లో జరిగే బహిరంగ సభలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొని ప్రసంగించనున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − seven =