మా బాసులు ఢిల్లీలో లేరు, తెలంగాణ ప్రజలే మా బాసులు: సీఎం కేసీఆర్

Campaigning For GHMC Elections, CM KCR Public Meeting, CM KCR Public Meeting At LB Stadium, CM KCR Public Meeting in LB Stadium, CM KCR Public Meeting LB Stadium, GHMC Elections, GHMC Elections 2020, GHMC Elections Campaigning, GHMC Elections News, GHMC Elections Updates, Greater Hyderabad Municipal Corporation, KCR Public Meeting, Mango News

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రసంగిస్తున్నారు. ఈ బహిరంగ సభలో రాష్ట్రమంత్రులు, జీహెచ్‌ఎంసీ పరిధిలోని టిఆర్ఎస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ తరపున 150 డివిజన్లకు పోటీచేసే అభ్యర్థులు పాల్గొన్నారు. అలాగే కరోనా నిబంధనలకు అనుగుణంగా ఏర్పాటు చేసిన ఈ సభకు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్దఎత్తున హాజరయ్యారు.

సీఎం కేసీఆర్ ప్రసంగం హైలైట్స్:

  • మా బాసులు ఢిల్లీలో లేరు. తెలంగాణ ప్రజలే మా బాసులు. ప్రజల అవసరాలే ఇతివృత్తం. ప్రజల సమస్యలే కేంద్రబిందువు. ప్రజల బతుకుదెరువే మా ఆలోచన. పేదల సంక్షేమమే మా ఆలోచన. దేదీప్యమానంగా ఉండే తెలంగాణ మా కల.
  • 6.5 లక్షల కుటుంబాలకు వరద సాయంగా రూ.650 కోట్లు ఇచ్చాం.
  • డిసెంబర్ 7 నుంచి మళ్ళీ వరదసాయం పంపిణీ చేస్తాం. అర్హులైనవారందరికీ రూ.10వేల వరదసాయం అందిస్తాం.
  • వరదల వల్ల కోట్లు నష్టపోయి సాయం కింద రూ.1350 కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరితే, 13పైసలు కూడా ఇవ్వలేదు. మేం భారతదేశంలో లేమా?. 
  • వరద బాధితుల ఆదుకునేందుకు రానివాళ్లు, ఓట్లు అడిగేందుకు వరదలా వస్తున్నారు.
  • జీహెచ్‌ఎంసీ ఎన్నికలు అనగానే కేంద్రమంత్రులు, ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్రల నుంచి కూడా వస్తున్నారు. ఒక్క బక్క కేసీఆర్‌ను కొట్టడానికి ఇంత మంది రావాలా?
  • హైదరాబాద్‌ నగరానికి పెద్దఎత్తున పరిశ్రమలు వస్తున్నాయి. టీపాస్‌ కావాలా లేదా కర్ఫ్యూ పాస్‌ కావాలా అనేది బిల్డర్లు ఆలోచించుకోవాలి.
  • జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓట్లు వేసే ముందు ప్రజలు ఆలోచించాలి. నాయకుల పనితీరు చూసే ఓటు వేయాలి.
  • రాబోయే కొద్ది నెలల్లో హైదరాబాద్ నగరంలో 24 గంటల వాటర్ సరఫరా సౌకర్యం ఏర్పాటు చేస్తాం.
  • నగరంలో శాశ్వతంగా 20 వేల లీటర్ల వరకు ఉచితంగా నీటి సరఫరా, 97 శాతం మంది ప్రజలకు లబ్ధి జరుగుతుంది. ఢిల్లీ తరవాత హైదరాబాద్ లోనే ఈ పథకం అమలు.
  • పల్లెవెలుగు పథకం ద్వారా ప్రతి గ్రామపంచాయితీకి ఒక ట్రాక్టర్ ఉంది. ఒక వాటర్ ట్యాంకర్, నర్సరీ ఉంది. దేశంలో ఎక్కడా లేదు.
  • కంటివెలుగు పథకం చరిత్రాత్మకం. 50-60 లక్షల మంది ప్రజలకు అద్దాలు, మందులతో వైద్య సదుపాయం కల్పించాం.
  • కల్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్, బస్తిదవాఖానాలతో ప్రజలకు మేలు చేస్తున్నాం.
  • బార్బర్ షాపులకు, సెలున్లకు ఉచిత విద్యుత్‌ సరఫరా.
  • రాష్ట్రవ్యాప్తంగా లాండ్రిలకు, ధోబీఘాట్ లకు ఉచిత విద్యుత్.
  • గోదావరితో మూసీనదిని అనుసంధానం చేసి ప్రక్షాళన చేస్తాం.
  • మెట్రోను ఎయిర్ పోర్ట్ వరకు లింక్ చేస్తాం.
  • వరదల నుంచి హైదరాబాద్‌ను కాపాడుకోవాలి. సమగ్ర చర్యల కోసం బడ్జెట్ లో ఏటా 10వేల కోట్లు కేటాయిస్తాం.
  • హైదరాబాద్‌ను కాపాడుకునేందుకు ప్రజలు, మేధావులు, విద్యావంతులు ఆలోచించాలి. పనిచేసే ప్రభుత్వానికి ఓటేసి మద్దతు ప్రకటించాలి.
  • మంచి విజ్ఞత కలిగిన అభ్యర్థులను బరిలోకి దింపాము. ప్రజలంతా కారు గుర్తుకు ఓటేసి టిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + nine =