సీఎం కేసీఆర్ తో బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి, రాకేష్ టికాయత్ భేటీ

BJP MP Subramanian Swamy and Rakesh Tikait Meets Telangana CM KCR at Delhi, BJP MP Subramanian Swamy, Rakesh Tikait, BJP MP Subramanian Swamy and Rakesh Tikait Meets Telangana CM KCR, Rakesh Tikait Meets Telangana CM KCR at Delhi, BJP MP Subramanian Swamy Meets Telangana CM KCR at Delhi, BJP MP, CM KCR Delhi Tour, CM KCR Likely to Meet BJP MP Subramanian Swamy and Rakesh Tikait, KCR Delhi Tour, Delhi Tour, Telangana CM KCR, CM KCR, Telangana, Chief minister, Chief minister Of Telangana, KCR, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రస్తుతం ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం నాడు బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి, బీకేయూ రైతు సంఘం నేత రాకేష్ టికాయత్ సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఢిల్లీలోని సీఎం కేసీఆర్ నివాసంలో ఈ భేటీ జరిగింది. బీజేపీ వ్యతిరేక కూటమి, దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పులు దిశగా తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తానని సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అనంతరం వరుసగా పలువురు జాతీయ నేతలతో సీఎం కేసీఆర్ భేటీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ సుబ్రమణ్య స్వామి, రైతు సంఘం నేత రాకేష్ టికాయత్ తో భేటీ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీ సందర్భంగా దేశంలో ప్రస్తుతం నెల‌కున్న రాజ‌కీయ ప‌రిస్థితులు, భ‌విష్య‌త్ మార్పులు, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన రైతు ఉద్యమంలో చోటుచేసుకున్న సంఘటనలు, పలు ఇతర అంశాలపై వీరూ చర్చించినట్టుగా తెలుస్తుంది. ఈ భేటీలో టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్, రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ వైస్ ప్రెసిడెంట్ వినోద్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + three =