తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం నాడు బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి, బీకేయూ రైతు సంఘం నేత రాకేష్ టికాయత్ సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఢిల్లీలోని సీఎం కేసీఆర్ నివాసంలో ఈ భేటీ జరిగింది. బీజేపీ వ్యతిరేక కూటమి, దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పులు దిశగా తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తానని సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అనంతరం వరుసగా పలువురు జాతీయ నేతలతో సీఎం కేసీఆర్ భేటీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ సుబ్రమణ్య స్వామి, రైతు సంఘం నేత రాకేష్ టికాయత్ తో భేటీ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీ సందర్భంగా దేశంలో ప్రస్తుతం నెలకున్న రాజకీయ పరిస్థితులు, భవిష్యత్ మార్పులు, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన రైతు ఉద్యమంలో చోటుచేసుకున్న సంఘటనలు, పలు ఇతర అంశాలపై వీరూ చర్చించినట్టుగా తెలుస్తుంది. ఈ భేటీలో టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్, రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ వైస్ ప్రెసిడెంట్ వినోద్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ