ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు విచారణలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కీలక నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఆదివారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఖండించారు. ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. “ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది అదానికి ప్రధాని మోదీకి నడుమనున్న అనుబంధం నుంచి ప్రజల దృష్టిని మళ్ళించడానికి చేసిన పనే తప్ప మరోటి కాదు” అని సీఎం కేసీఆర్ అన్నారు.
మరోవైపు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కూడా మనీశ్ సిసోడియా అరెస్ట్ ను ఖండిస్తూ, ఈ అరెస్టు ఆప్రజాస్వామికమని, బీజేపీ పార్టీ ప్రతిపక్షాలపైన వ్యవహరిస్తున్న తీరు దుర్మార్గపూరితమని పేర్కొన్నారు. కాగా సీబీఐ అధికారులు మనీశ్ సిసోడియాను సోమవారం ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు కాంప్లెక్స్ వద్ద ప్రత్యేక న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. విచారణ అనంతరం మనీశ్ సిసోడియాను అయిదు రోజుల పాటుగా సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE