ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన ఏడు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు ఫిబ్రవరి 27, సోమవారం నాడు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) షెడ్యూల్ ను విడుదల చేసింది. ఏపీలో ఎమ్మెల్యే కోటా నుంచి ఎమ్మెల్సీలుగా ఎంపికైన నారా లోకేష్, పోతుల సునీత, బచ్చుల అర్జునుడు, డొక్కా మాణిక్య వరప్రసాద్, వరాహ వెంకట సూర్యనారాయణరాజు పెన్మెత్స, గంగుల ప్రభాకరరెడ్డిల యొక్క ఎమ్మెల్సీ పదవీకాలం 2023, మార్చి 29తో పూర్తి కానుంది. అలాగే చల్లా భగీరథరెడ్డి మృతితో ఖాళీ అయిన (2022, నవంబర్ 2) ఎమ్మెల్సీ స్థానానికి కూడా ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల సంఘం తాజాగా షెడ్యూల్ ప్రకటించింది. మార్చి 6వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుందని, మార్చి 23వ తేదీన పోలింగ్ నిర్వహించి, అదే రోజున ఓట్ల లెక్కింపు పక్రియ చేపట్టనున్నట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది.
ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్:
- నోటిఫికేషన్ జారీ – మార్చి 6
- నామినేషన్లకు ఆఖరితేదీ – మార్చి 13
- నామినేషన్ల పరిశీలన – మార్చి 14
- ఉపసంహరణకు ఆఖరుతేదీ – మార్చి 16
- పోలింగ్ జరిగే తేదీ – మార్చి 23
- పోలింగ్ సమయం – ఉదయం 09:00 నుంచి సాయంత్రం 04:00 వరకు
- ఓట్ల లెక్కింపు – మార్చి 23 (సాయంత్రం 5 గంటల నుంచి).
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE