తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మంగళవారం వనపర్తి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా వనపర్తిలో నూతనంగా ఏర్పాటు చేయబోయే ప్రభుత్వ మెడికల్ కాలేజీకి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగసభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. రేపొద్దున (మార్చి 9, బుధవారం) అసెంబ్లీలో నిరుద్యోగ యువ సోదరుల కోసం ప్రకటన చేయబోతున్నట్టు ప్రకటించారు. ఉదయం 10 గంటలకు అందరూ టీవీలు చూడాలని సూచించారు. ఏ విధమైన తెలంగాణ ఆవిష్కరామైందో, ఏ ప్రకటన చేయబోతున్నామో రేపు పది గంటలకు నిరుద్యోగ సోదరులు టీవీల్లో చూడాలని కోరారు.
ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఏం ప్రకటన చేయబోతున్నారనే అంశంపై నిరుద్యోగులతో పాటుగా తెలంగాణ ప్రజల్లో ఆసక్తి నెలకుంది. గత కొంత కాలంగా నిరుద్యోగులు ఎదురుచూస్తున్నా 50వేలకు పైగా భారీ ఉద్యోగ నోటిఫికేషన్ ప్రకటిస్తారా లేక నిరుద్యోగ భృతిపై ప్రకటన చేస్తారా? లేక మరేదైనా ప్రకటన ఉంటుందా అనేది వేచిచూడాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ