టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన మంగళవారం మధ్యాహ్నం తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభమైంది. టీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీ (ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు), పార్లమెంటరీ పార్టీ (ఎంపీలు), టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గంతో కూడిన సంయుక్త సమావేశం సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగుతుంది. ఈ సంయుక్త సమావేశానికి పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులతో పాటు రాష్ట్ర మంత్రులు, పార్టీ లోక్ సభ, రాజ్యసభ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా పలువురు రాష్ట్ర, జిల్లా స్థాయి పార్టీ నేతలు హాజరయ్యారు.
ఈ సమావేశం సందర్భంగా రాష్ట్రంలో ప్రస్తుతం నెలకున్న రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నారు. అలాగే వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంసిద్ధం కావడం, జిల్లాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక నేతల మధ్య సమన్వయం అంశం, పార్టీకి సంబంధించిన కొత్త నిర్ణయాలు, బీఆర్ఎస్ భవిష్యత్ కార్యాచరణ, మునుగోడు ఉపఎన్నిక గెలుపు, చోటుచేసుకున్న పరిణామాలపై విశ్లేషణ, బీజేపీపై పోరాటం కొనసాగింపు, ఇటీవల ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం సహా పలు అంశాలపై కీలకంగా చర్చంచి, పార్టీ నేతలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE