బక్రీద్ పండుగా సందర్భంగా ముస్లింలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్ పండుగ త్యాగానికి ప్రతీక అని సీఎం అన్నారు. ప్రవక్త శాంతి బోధనలను అనుసరించి, తోటి వారిపట్ల త్యాగం, కరుణ, సహనం ప్రదర్శించాలనే సందేశాన్ని బక్రీద్ నుంచి నేర్చుకోవాలని ఆకాంక్షిస్తూ, ముస్లిం సోదర, సోదరీమణులందరికి సీఎం కేసీఆర్ బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు.
విశ్వాసానికి, కరుణ, ఐక్యతకు ప్రతీక బక్రీద్ పండుగని అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ చేసుకునే బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులందరికి శుభాకాంక్షలు తెలిపారు. అల్లాహ్ ఆశీస్సులు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్ధిస్తున్నానని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ