తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆదివారం సాయంత్రం ప్రత్యేక విమానంలో ఆయన సతీమణి శోభారావు, కుమార్తె, ఎమ్మెల్సీ కె. కవితతో సహా ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. కొద్దిరోజుల క్రితమే ముఖ్యమంత్రి, ఆయన కుటుంబసభ్యులు న్యూఢిల్లీకి వెళ్లాల్సి ఉన్నప్పటికీ ఆ పర్యటన వాయిదా పడింది. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ ఎంపీలతో సమావేశం అయ్యారు. సమావేశంలో ముఖ్యంగా వరి సేకరణ, కేంద్రంతో టీఆర్ఎస్ ప్రభుత్వం పోటీ పడుతున్న పలు అంశాలపై ఆయన వారికి స్పష్టమైన దిశానిర్దేశం చేయనున్నారు. ధాన్యం సేకరణ అంశంపై ఈ నెల 11న ఢిల్లీలో నిరసన కార్యక్రమం చేపట్టాలని టీఆర్ఎస్ పార్టీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనికోసం పకడ్బందీ కార్యాచరణ రూపొందిస్తున్నారు. తమ నిరసన దేశవ్యాప్తంగా ఆకర్షించబడేలా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్తో కూడా భేటీ కానున్నారని సమాచారం. మరోవైపు తెలంగాణలో రైతులు పండించిన యాసంగి వడ్లను కేంద్ర ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో సోమవారం టీఆర్ఎస్ నిరసన దీక్షలు చేపట్టింది. తెలంగాణ లో పార్టీ చేస్తున్న ఆందోళనకు అనుగుణంగా లోక్సభ, రాజ్యసభలలో టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో నిరసనలు తెలుపుతున్నారు. కేంద్రం పంజాబ్ నుంచి 100 శాతం వరి ధాన్యాన్ని సేకరిస్తున్నదని, తెలంగాణ నుంచి కూడా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ) ద్వారా 100 శాతం వరి ధాన్యం కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ