తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు బుధవారం మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లా నూతన సమీకృత కలెక్టరేట్ సముదాయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్లో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. నూతన కలెక్టరేట్ ప్రధాన కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఎస్.హరీష్ ను కూర్చోబెట్టి పుష్పగుచ్ఛం అందించి సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. అధికారులకు శాలువాలు కప్పి సీఎం సత్కరించారు. ఈ సందర్భంగా సర్వమత పార్ధనలు కూడా నిర్వహించారు.
జిల్లాలోని శామీర్పేట మండలం అంతాయిపల్లిలో మొత్తం 30 ఎకరాల విస్తీర్ణంలో రూ.56.20 కోట్ల నిధులతో ఈ సమీకృత సమీకృత కార్యాలయాల సముదాయ భవనాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, చామకూర మల్లారెడ్డి, కలెక్టర్ ఎస్.హరీష్, పలువురు స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం స్థానిక ఐడీవోసీ పెరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రజలనుద్ధేశించి ప్రసంగించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY