బుధవారం కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ నాయకురాలు, అధికార బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దీనిపై ట్వీట్ చేశారు. ‘ప్రియమైన కర్ణాటక ప్రజలారా.. ఈ ఎన్నికల్లో ద్వేషాన్ని తిరస్కరించండి, అభివృద్ధికి మాత్రమే ఓటేయండి’ అని ఆమె పిలుపునిచ్చారు. ప్రజల క్షేమాన్ని మరియు సమాజ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ఓటేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత తన ట్వీట్లో ఆకాంక్షించారు. కాగా కర్ణాటకలోని మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు నేడు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తోంది ఎన్నికల సంఘం. ఈ ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఇక ఈ ఎన్నికల్లో 2,615 మంది అభ్యర్థులు బరిలో నిలవగా.. 5,31,33,054 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
Dear Karnataka,
Reject Hatred!
Vote for development , prosperity & well-being of the society and the people.
— Kavitha Kalvakuntla (@RaoKavitha) May 10, 2023
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE