తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సూపర్స్టార్ కృష్ణ పార్థివదేహానికి నివాళులర్పించారు. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం ఆయన నానక్రాంగూడలోని విజయకృష్ణ నివాసానికి చేరుకుని కృష్ణ భౌతికకాయంపై పూలు చల్లి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా కృష్ణ కుమారుడు, టాలీవుడ్ నటుడు మహేష్ బాబు సహా ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఇక సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు కృష్ణ పార్థివదేహానికి నివాళులర్పించారు. ఇక అంతకుముందు మంత్రి కేటీఆర్ కూడా కృష్ణ నివాసానికి చేరుకొని మహేష్ బాబుని కలిసి ఓదార్చారు. ఈ క్రమంలో అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్ల గురించి ఆరా తీశారు. కాగా కృష్ణ మరణవార్త తెలుసుకున్న పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా కృష్ణ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సినీ రంగానికి కృష్ణ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE