లాక్డౌన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో అనుసరించాల్సిన వ్యూహంపై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఈ రోజు కేబినెట్ సమావేశం జరిగింది. అనంతరం సీఎం కేసీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మే 31 వరకు రాష్ట్రంలో లాక్డౌన్ ను పొడిగిస్తునట్టు వెల్లడించారు. అలాగే రాష్ట్రంలో రేపు ఉదయం ఆరు గంటలనుంచే ఆర్టీసీ బస్సుల సర్వీసులు ప్రారంభమవుతాయని చెప్పారు. హైదరాబాద్ లో సిటీ బస్సులు మాత్రం నడవవని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ హైలైట్స్:
- రాష్ట్రంలో కంటైన్మెంట్ ఏరియాలు తప్ప మిగిలిన అన్ని ప్రాంతాలను గ్రీన్ జోన్లుగా ప్రకటన.
- తెలంగాణ రాష్ట్రంలో మే 31 వరకు లాక్డౌన్ పొడిగింపు.
- ప్రస్తుతం 1452 కుటుంబాలు కంటైన్మెంట్ జోన్ల పరిధిలో ఉన్నాయి.
- కంటైన్మెంట్ జోన్ల కుటుంబాలకు నిత్యావసర వస్తువులను ప్రభుత్వమే సరఫరా చేస్తుంది.
- కరోనా తో కలిసి జీవించడం నేర్చుకోవాలి.
- రేపు ఉదయం ఆరు గంటలనుంచే ఆర్టీసీ బస్సుల సర్వీసులు ప్రారంభం.
- బస్సులను కోవిడ్ నిబంధనలను అనుసరించి నడపనున్నాం.
- హైదరాబాద్ లో సిటీ బస్సులు నడవవు.
- వేరే రాష్ట్రాల బస్సులను అనుమతించం. అలాగే తెలంగాణ రాష్ట్ర బస్సులను వేరే రాష్ట్రాలకు పంపించం.
- రాష్ట్రంలో ఆటోలు, టాక్సీలకు అనుమతి.
- ఆటోలో డ్రైవర్ తో పాటు ఇద్దరు, కార్లు, టాక్సీలలో డ్రైవర్ తో పాటు ఇద్దరికే అనుమతి.
- కంటైన్మెంట్ ఏరియాలో ఎలాంటి దుకాణాలు తెరవడానికి అనుమతి లేదు.
- హైదరాబాద్ నగరంలో సరి, బేసి విధానంలో దుకాణాలు తెరవడానికి అనుమతి.
- రాష్ట్రంలో మిగతా అన్ని ప్రాంతాల్లో అన్ని రకాల దుకాణాలు తెరిచేందుకు అనుమతి.
- పుడ్ డెలివరీకి అనుమతి.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu