ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జూలై 4, ఆదివారం నాడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ముందుగా తంగళ్లపల్లి మండలం మండేపల్లి వద్ద రూ.రూ.83.37 కోట్లతో నిర్మించిన 1,320 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. అనంతరం మండేపల్లి శివారులో 20 ఎకరాల్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్ (ఐడీటీఆర్)ను ప్రారంభించారు. ఆతర్వాత సిరిసిల్లలో రూ.36 కోట్లతో ఐదు ఎకరాల్లో నిర్మించిన నర్సింగ్ కళాశాల భవనాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు.
మరోవైపు సిరిసిల్ల మండలం సర్ధాపూర్లో రూ.22 కోట్లతో నిర్మించిన వ్యవసాయ మార్కెట్ యార్డుకు, అలాగే సిరిసిల్లలో 82 ఎకరాల్లో రూ.70 కోట్లతో అన్ని సదుపాయాలతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్ (సమీకృత కలెక్టరేట్) భవనాన్ని కూడా సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్ తో పాటుగా కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్రెడ్డి, పువ్వాడ అజయ్కుమార్, సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ సోమేశ్ కుమార్, పలువురు జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ