దేశంలోని అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన కొల్హాపూర్ లోని శ్రీ అంబాబాయి మహాలక్ష్మీ అమ్మవారిని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఈరోజు దర్శించుకున్నారు. మహాలక్ష్మీ అమ్మవారి దర్శనార్ధం సీఎం కేసీఆర్ గురువారం ఉదయం మహారాష్ట్ర లోని కొల్హాపూర్ బయల్దేరి వెళ్లారు. హైదరాబాద్ నుంచి సతీసమేతంగా విమానంలో కొల్హాపూర్ చేరుకున్న సీఎం కేసీఆర్ మధ్యాహ్న సమయానికి అంబాబాయి మహాలక్ష్మీ ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ దంపతులకు ఆలయ మర్యాదలతో అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం కేసీఆర్ దంపతులు ఆలయంలో కార్వీర్ నివాసిని అంబాబాయి మహాలక్ష్మీ అలంకార పూజలో పాల్గొన్నారు.
ఆపై సీఎం కేసీఆర్ దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ క్రమంలో కేసీఆర్ దంపతులకు అర్చకులు ఆశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ దంపతులతో పాటు ఇతర కుటుంబ సభ్యులు, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి శ్రవణ్ కుమార్, నమస్తే తెలంగాణ ఎండీ దామోదర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ పర్యటన ముగించుకున్న అనంతరం సీఎం కేసీఆర్ కుటుంబం తిరిగి సాయంత్రం హైదరాబాద్ చేరుకోనుంది. అష్టాదశ శక్తి పీఠాల్లో కొల్హాపూర్ పీఠం ఏడవ శక్తిపీఠంగా పురాణాలలో చెప్పబడింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ