తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బుధవారం నాడు జగిత్యాల జిల్లాకు వెళ్లారు. ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ తండ్రి, టీఆర్ఎస్ నాయకుడు బాల్క సురేష్ ఇటీవలే అనారోగ్యంతో మరణించారు. ఈ నేపథ్యంలో మెట్పల్లిలోని రేగుంటలో గల వారి ఇంటికి వెళ్లి ఎమ్మెల్యే బాల్క సుమన్ ను, ఆయన కుటుంబ సభ్యులను సీఎం కేసీఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగా బాల్క సుమన్ తండ్రి సురేష్ చిత్రపటానికి సీఎం కేసీఆర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ వెంట పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నారు. అనంతరం సీఎం కేసీఆర్ తిరిగి హైదరాబాద్ కు ప్రయాణం అయ్యారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ