తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కు కరోనా నెగటివ్ గా నిర్ధారణ అయింది. సీఎం కేసీఆర్ వ్యక్తిగత వైద్యులు డాక్టర్ ఎం.వి.రావు ఆధ్వర్యంలోని వైద్య బృందం బుధవారం నాడు వ్యవసాయక్షేత్రంలో ఐసోలేషన్ లో వున్న సీఎం కేసీఆర్ కు కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాపిడ్ యాంటీజెన్ తో పాటు ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించగా రాపిడ్ టెస్టులో నెగటివ్ గా రిపోర్టు వచ్చింది. కాగా ఆర్టీపీసీఆర్ పరీక్షా ఫలితాలు రేపు రానున్నాయని తెలిపారు.
ముందుగా ఏప్రిల్ 19న స్వల్ప లక్షణాలతో సీఎం కేసీఆర్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైద్యుల సూచనల మేరకు అప్పటినుంచే సీఎం కేసీఆర్ తన ఫామ్ హౌస్లో ఐసోలేషన్ లో ఉన్నారు. వైద్యుల బృందం సీఎం కేసీఆర్ ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా నిర్వహించిన కరోనా రాపిడ్ టెస్టులో రిపోర్ట్ నెగటివ్ గా వచ్చినట్టు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ