తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ విజయవంతంగా కొనసాగుతుంది. కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా సోమవారం నాడు రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో 335 కేంద్రాల్లో 13666 మందికి వ్యాక్సిన్ వేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. సోమవారం రాష్ట్రంలోని 16,750 హెల్త్కేర్ వర్కర్లకు వ్యాక్సిన్ వేసేలా లక్ష్యంగా పెట్టుకోగా, అందులో 82 శాతం (13,666) మందికి వ్యాక్సిన్ వేసినట్టు పేర్కొన్నారు. అలాగే వ్యాక్సిన్ తీసుకున్న వారిలో 15 మంది స్వల్ప అస్వస్థతకు గురయ్యారని, వారంతా ఆరోగ్యంగానే ఉన్నట్టు తెలిపారు.
మరోవైపు మంగళవారం నాడు మొత్తం 1034 కేంద్రాల్లో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఒక్కో కేంద్రంలో 100 మంది చొప్పున మొత్తం లక్షమందికి మందికి వ్యాక్సిన్ వేయనున్నట్టు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ఇందుకోసం ఇప్పటికే అన్ని జిల్లాలలోని కోల్డ్ స్టోరేజ్ సెంటర్లకి 1.70 లక్షల కొవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులు తరలించారు. ఇక వారంలో సోమ, మంగళ, గురు, శుక్రవారాల్లో మాత్రమే వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టనున్నట్టు అధికారులు నిర్ణయించిన సంగతి తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ