దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. గతకొన్ని రోజులుగా రోజువారీ పాజిటివ్ కేసులు 2 వేల కంటే తక్కువుగా నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 1,223 పాజిటివ్ కేసులు నమోదవడంతో, దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,30,23,215 కు చేరుకుంది. అలాగే కరోనా వలన మరో 31 మంది మరణించడంతో మరణాల సంఖ్య 5,21,101 కి పెరిగింది. ప్రస్తుతం రికవరీ రేటు 98.75 శాతంగానూ, మరణాల రేటు 1.21 శాతంగా ఉంది. అలాగే 14,704 (0.03%) మంది కరోనా బాధితులు హోం ఐసోలేషన్ లలో, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక దేశంలో కొత్తగా 1,876 కరోనా బాధితులు కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 4,24,87,410 కు చేరుకుంది.
గత 24 గంటల్లో కేరళ (424), మిజోరాం (157), మహారాష్ట్ర (103), ఢిల్లీ (95), హర్యానా (55), వెస్ట్ బెంగాల్ (45), కర్ణాటక (42), ఉత్తర్ ప్రదేశ్ (40), ఒడిశా (37), తమిళనాడు (37), తెలంగాణ (32) వంటి రాష్ట్రాల్లోనే కరోనా కేసులు పెద్దసంఖ్యలో నమోదయ్యాయి. మరోవైపు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద మార్చి 30, బుధవారం ఉదయం 7 గంటల వరకు 183.82 కోట్ల (1,83,82,41,743) కరోనా వ్యాక్సిన్ డోసులు ప్రజలకు అందించబడ్డాయని తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ