తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్-19 (కరోనా వైరస్) రోజురోజుకి క్రమంగా విజృంభిస్తుంది. మార్చ్ 25 , బుధవారం నాటికీ రాష్ట్రంలో 41 కరోనా పాజిటివ్ కేసుల నమోదయ్యినట్టు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. రాష్టంలో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు పలు చర్యలు తీసుకోవడంతో పాటుగా లాక్ డౌన్ కూడా విధించారు. ఈ నేపథ్యంలో కరోనా పై పోరాటం చేసేందుకు ప్రభుత్వ ప్రయత్నానికి పలువురు సహకారం అందిస్తూ సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాలు అందిస్తున్నారు.
ఈ నేపథ్యంలో కరోనా వైరస్ని ఎదుర్కోడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టిఆర్ఎస్ పార్టీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ వంతు సహాయంగా ఒక నెల వేతనంతో పాటుగా ఒక ఏడాది నియోజక వర్గ అభివృద్ధి నిధులు మొత్తం కలిపి దాదాపు రూ.500 కోట్ల రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్కి విరాళంగా అందించడానికి ముందుకు వచ్చారు. ఈ విషయాన్ని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీర్ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. ముందుగా టిఆర్ఎస్ పార్టీకి చెందిన 16 మంది ఎంపీలు మొత్తం 80 కోట్ల రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాలుగా ఇచ్చారు. టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ కే కేశవరావు, లోక్సభ పార్టీ పక్ష నేత నామా నాగేశ్వర రావు బుధవారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ ను కలుసుకుని విరాళానికి సంబంధించి లెటర్ అందించారు. అనంతరం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఒక నెల జీతంతో పాటుగా ఈ ఏడాదికి విడుదలయ్యే నిధులను కూడా విరాళంగా ప్రకటించారు.
Happy & proud to announce that all Ministers, MPs, MLAs & MLCs of @trspartyonline have declared one year constituency development fund/MP LADs & salary (Approx ₹ 500 Crores) to the Chief Minister’s Relief Fund 😊
Kudos to the leadership of Hon’ble CM & our president KCR Garu 🙏
— KTR (@KTRTRS) March 25, 2020