తెలంగాణ రాష్ట్రంలో మార్చ్ 22, ఆదివారం నాటికీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 27 కు చేరుకుంది. ఆదివారం ఒక్కరోజే ఆరుగురికి కరోనా వైరస్ నిర్ధారణ అయింది. ముందుగా రాష్ట్రంలో పాజిటివ్గా తేలిన యువకుడు ఇప్పటికే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడని, మిగిలిన 26 మందిని ఐసొలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలంగాణ వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. ఆదివారం రోజు కరోనా వైరస్ పాజిటివ్ గా తేలిన వ్యక్తులంతా విదేశాల నుంచి వచ్చిన వారేనని ప్రకటించారు. మరో వైపు కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ప్రగతి భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో మార్చ్ 31వ తేదీ వరకు లాక్డౌన్ ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని, స్వచ్ఛందంగా స్పందిస్తూ ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
దేశం మొత్తం మీద ఇప్పటివరకు 415 కరోనా కేసులు నమోదు కాగా, ఒక్క మహారాష్ట్ర రాష్ట్రంలోనే అత్యధికంగా 74 కేసులు నమోదయ్యాయి. ఆదివారం ఒక్క రోజే మహారాష్ట్రలో కొత్తగా 10 మందికి కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. ఉత్తరప్రదేశ్ లో 27, కర్ణాటకలో 26, గుజరాత్లో18, ఆంధ్రప్రదేశ్ లో 6 కేసులు నమోదైనట్టు ప్రకటించారు, ఇక ఇప్పటివరకు దేశంలో కరోనా మహమ్మారి వలన ఏడుగురు మరణించినట్లుగా కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.
ఈ అంశానికి సంబంధించిన మరిన్ని వార్తలు:
మార్చ్ 31 వరకు తెలంగాణ లాక్డౌన్ – సీఎం కేసీఆర్
మార్చ్ 31 వరకు ఆంధ్రప్రదేశ్ లో లాక్డౌన్
దేశంలో 75 జిల్లాల్లో లాక్డౌన్ ప్రకటన
మార్చ్ 31 వరకు లాక్ డౌన్ మరింత కఠినంగా అమలు – సీఎస్ సోమేశ్ కుమార్
[subscribe]