తెలంగాణలో కరోనా వైరస్ తీవ్రత రోజురోజుకి మరింతగా పెరుగుతుంది. రాష్ట్రంలో మరో 1892 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి మొదలయ్యాక ఒక్కరోజులో అత్యధికంగా ఇన్నికేసులు నమోదవడం ఇదే తొలిసారి. దీంతో జూలై 3, శుక్రవారం నాటికీ మొత్తం కేసుల సంఖ్య 20,462 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. శుక్రవారం నాడు 5965 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. అలాగే కరోనా వలన మరో 8 మంది మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 283 కి పెరిగినట్టు తెలిపారు.
ఇక కొత్తగా కోవిడ్ నుంచి కోలుకున్న1126 మందితో కలిపి డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 10195 కి చేరింది. ప్రస్తుతం 9984 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 1658, రంగారెడ్డి లో 56, మేడ్చల్ లో 44, వరంగల్ రూరల్ లో 41, సంగారెడ్డిలో 20, నల్గొండలో 13, మహబూబ్ నగర్ లో 12 నమోదయ్యాయి.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu