దేశంలో కోవిడ్-19 (కరోనా వైరస్) మహమ్మారి మరింతగా విజృంభిస్తుంది. జూలై 4, శనివారం ఉదయానికి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 6,48,315 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 22,771 కరోనా పాజిటివ్ కేసులు, 442 కరోనా మరణాలు నమోదయ్యాయి. గత కొన్ని రోజులుగా ప్రతిరోజూ 20వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అయితే కరోనా బాధితుల సంఖ్య కంటే కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య ఎక్కువుగా ఉండడం ఊరట కలిగిస్తుంది.
అలాగే దేశంలో కరోనా వైరస్ సోకి మరణించిన వారి సంఖ్య 18,655 కి చేరింది. కరోనా బాధితుల్లో ఇప్పటివరకు 3,94,227 మంది పూర్తిస్థాయిలో కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా, ప్రస్తుతం 2,35,433 మంది చికిత్స పొందుతున్నారు. మరోవైపు ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న దేశాల్లో అమెరికా, బ్రెజిల్, రష్యా ల తర్వాత భారత్ నాలుగో స్థానంలో ఉంది. అలాగే కరోనా మరణాల్లో మాత్రం భారత్ ప్రపంచంలో ఎనిమిదో స్థానంలో కొనసాగతుంది.
#CoronaVirusUpdates: #COVID19 India Tracker
(As on 4th July, 2020, 08:00 AM)Confirmed cases: 648,315
Active cases: 235,433
Cured/Discharged/Migrated: 394,227
Deaths: 18,655#IndiaFightsCorona#StayHome #StaySafe @ICMRDELHIVia @MoHFW_INDIA pic.twitter.com/5naxiiZXq8
— #IndiaFightsCorona (@COVIDNewsByMIB) July 4, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu