తెలంగాణలో కరోనావైరస్ ప్రభావం రోజురోజుకి మరింతగా పెరుగుతుంది. రాష్ట్రంలో మరో 1850 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూలై 4, శనివారం సాయంత్రం 5 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 22,312 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. శనివారం నాడు 6427 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. అలాగే కరోనా వలన మరో 5 మంది మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 288 కి పెరిగింది. కోవిడ్ నుంచి మరో 1342 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 11537 కి చేరింది. ప్రస్తుతం 10487 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(1850):
- జీహెచ్ఎంసీ ఏరియా – 1572
- రంగారెడ్డి – 92
- మేడ్చల్ – 53
- వరంగల్ అర్బన్ – 31
- కరీంనగర్ – 18
- నిజామాబాద్ – 17
- నల్గొండ – 10
- సంగారెడ్డి – 8
- ఖమ్మం – 7
- వరంగల్ రూరల్ – 6
- జగిత్యాల – 5
- మహబూబ్ నగర్ – 5
- సిద్ధిపేట – 5
- జయశంకర్ భూపాలపల్లి – 4
- జనగామ – 3
- వికారాబాద్ – 3
- భద్రాద్రి కొత్తగూడెం – 3
- రాజన్న సిరిసిల్ల – 3
- గద్వాల్ – 2
- నిర్మల్ – 1
- భువనగిరి – 1
- మెదక్ – 1
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu