తెలంగాణలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో మరో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆగస్టు 3, సోమవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 68,946 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. సోమవారం నాడు 13,787 శాంపిల్స్ పరీక్షించినట్టుగా పేర్కొన్నారు. కరోనా వలన మరో 12 మంది మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 563 కి పెరిగింది. ఇప్పటివరకు 49,675 మంది కరోనా నుంచి కోలుకోగా, ప్రస్తుతం 18,708 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 72 శాతానికి చేరుకోగా, మరణాల రేటు 0.81 (<1%) శాతంగా ఉంది.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(1286):
- జీహెచ్ఎంసీ – 391
- రంగారెడ్డి – 121
- కరీంనగర్ – 101
- మేడ్చల్ – 72
- వరంగల్ అర్బన్ – 63
- నిజామాబాద్ – 59
- జోగులాంబ గద్వాల్ – 55
- ఖమ్మం – 41
- మహబూబ్ నగర్ – 39
- భద్రాద్రి కొత్తగూడెం – 38
- నాగర్ కర్నూల్ – 29
- నల్గొండ – 29
- పెద్దపల్లి – 29
- మహబూబాబాద్ – 27
- సూర్యాపేట – 23
- జగిత్యాల – 22
- మంచిర్యాల – 21
- వికారాబాద్ – 17
- సంగారెడ్డి – 15
- సిద్దిపేట – 14
- వనపర్తి – 14
- వరంగల్ రూరల్ – 11
- ఆదిలాబాద్ – 9
- జనగామ – 8
- మెదక్ – 7
- జయశంకర్ భూపాలపల్లి – 6
- కామారెడ్డి – 6
- ములుగు – 5
- నారాయణ్ పేట్ – 4
- నిర్మల్ – 4
- యాదాద్రి భువనగిరి – 3
- ఆసిఫాబాద్ – 3
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu