దుబ్బాక ఉప ఎన్నికలో పోటీ చేస్తాం – పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి

Congress to contest by-poll from Dubbak, Congress will Contest in Dubbaka Assembly bypoll, Dubbak Elections, Dubbaka Assembly bypoll, telangana, Telangana Congress, Telangana News, Telangana PCC Chief Uttam Kumar Reddy, Uttam Kumar Reddy

దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి జరగబోయే ఉప ఎన్నికలకు సంబంధించి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఈ రోజు స్పష్టత నిచ్చారు. దుబ్బాకలో పోటీ చేయాలని పీసీసీ నిర్ణయించిందని చెప్పారు. ఈ ఎన్నికల అంశంపై పార్టీ నాయకులు ఏదైనా మాట్లాడినా అది వారి వ్యక్తిగత మన్నారు. ఉప ఎన్నికలో పోటీ చేసే విషయంలో ఎవరికీ అనుమానం అక్కర్లేదని, మండలాల వారిగా సమావేశాలు నిర్వహించాలని డీసీసీకి సూచించారు. గతంలో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు చనిపోతే, అక్కడ టిఆర్ఎస్ పోటీ చేసిందని ఆయన గుర్తు చేశారు. దుబ్బాక టిఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఇటీవలే అనారోగ్యంతో కన్నుమూశారు. దీంతో ఆ స్థానం ఖాళీ అవడంతో ఉప ఎన్నిక జరగనుంది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − four =