తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు 18, మంగళవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 95,700 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ లో పేర్కొంది. మంగళవారం నాడు కొత్తగా 1763 కేసులు నమోదవగా, 24,542 శాంపిల్స్ పరీక్షించినట్టుగా పేర్కొన్నారు. కరోనా వలన మరో 8 మంది మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 719 కి పెరిగింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 73,991 మంది కరోనా నుంచి కోలుకోగా, ప్రస్తుతం 20,990 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 77.31 శాతానికి చేరుకోగా, మరణాల రేటు 0.75 (<1%) శాతంగా ఉంది.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(1763):
- జీహెచ్ఎంసీ – 484
- మేడ్చల్ – 169
- రంగారెడ్డి – 166
- వరంగల్ అర్బన్ – 88
- నల్గొండ – 65
- కామారెడ్డి – 63
- జగిత్యాల – 61
- మంచిర్యాల – 55
- కరీంనగర్ – 53
- పెద్దపల్లి – 46
- నిజామాబాద్ – 45
- ఖమ్మం – 41
- సిద్దిపేట – 37
- భద్రాద్రి కొత్తగూడెం – 35
- మహబూబ్ నగర్ – 33
- వరంగల్ రూరల్ – 31
- సంగారెడ్డి – 31
- రాజన్న సిరిసిల్ల – 31
- జోగులాంబ గద్వాల్ – 30
- వనపర్తి – 21
- జనగామ – 20
- సూర్యాపేట – 20
- మహబూబాబాద్ – 18
- జయశంకర్ భూపాలపల్లి – 17
- మెదక్ – 17
- నిర్మల్ – 16
- యాదాద్రి భువనగిరి – 15
- నాగర్ కర్నూల్ – 15
- ములుగు – 12
- ఆదిలాబాద్ – 8
- వికారాబాద్ – 8
- ఆసిఫాబాద్ – 6
- నారాయణ్ పేట్ – 6
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu