తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 10, గురువారం నాటికీ కరోనా పరీక్షలు సంఖ్య 20 లక్షలు దాటింది. గురువారం నాడు 62,890 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించడంతో మొత్తం పరీక్షల సంఖ్య 20,16,461 కు చేరుకుంది. రాష్ట్రంలో ప్రతి పది లక్షల జనాభాకు 54,313 పరీక్షలు నిర్వహించారు. మరోవైపు రాష్ట్రంలో కొత్తగా 2426 కరోనా పాజిటివ్ కేసులు, 13 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 2426 కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,52,602 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది.
ఈ వైరస్ వలన ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 940 కి పెరిగింది. ఇక కరోనా నుంచి కోలుకుని ఇప్పటికి 1,19,467 మంది సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ కాగా, గత 24 గంటల్లోనే 2,324 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 32,195 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu