సచివాలయ ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన కంటి వెలుగు ప్రత్యేక వైద్య శిబిరాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సోమవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో ప్రారంభించారు. సోమవారం నుండి పది రోజుల వరకు ఈ ప్రత్యేక కంటి వెలుగు వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నట్లు అధికారులు తెలియజేశారు. ప్రతి రోజు సుమారు వంద మందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. సచివాలయ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీఎస్ శాంతి కుమారి ఉద్యోగులను కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE