ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు సెప్టెంబర్ 16 నుండి 18వ తేదీ వరకు మూడు రోజుల పాటు నిర్వహించే తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల కార్యక్రమాల నిర్వహణపై బుధవారం బీఆర్కేఆర్ భవన్లో డీజీపీ మహేందర్రెడ్డితో కలసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్ కుమార్, జిల్లా కలెక్టర్లు, పోలీసు కమీషనర్లు/పోలీసు సూపరింటెండెంట్లు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ సందర్బంగా సీఎస్ సోమేశ్ కుమార్ చేసిన సూచనలు ఇవే:
- తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు ఈ నెల 16 నుంచి 18 వరకు జరగనున్నాయి.
- 16వ తేదీన రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు 15,000 మంది పాల్గొనేలా ర్యాలీలు నిర్వహించాలి.
- ర్యాలీ తర్వాత బహిరంగ సభను నిర్వహించాలి. ప్రతి జిల్లాకు 10,000 జాతీయ జెండాలు, 50 పెద్ద జెండాలు అందించడం జరుగుతుంది..
- ఈ కార్యక్రమాల నిర్వహణ, పర్యవేక్షణకై సీనియర్ అధికారిని ప్రతీ నియోజకవర్గానికి నోడల్ అధికారిగా నామినేట్ చేయాలి.
- 17వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో మంత్రులు/ప్రజాప్రతినిధులచే జాతీయ జెండాను ఎగురవేయించాలి.
- 17న హైదరాబాద్ లోని పబ్లిక్ గార్డెన్లో సీఎం కేసీఆర్ జెండాను ఎగురవేయనున్నారు.
- అదే రోజున సీఎం కేసీఆర్ హైదరాబాద్ లో కొమరం భీమ్ ఆదివాసీ భవనం మరియు సంత్ సేవాలాల్ బంజారా భవన్ లను కూడా ప్రారంభిస్తారు. అనంతరం ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
- గిరిజన సంఘాలకు చెందిన అధికారులతో పాటు ప్రజాప్రతినిధులందరిని మధ్యాహ్నం జరిగే సమావేశానికి హాజరయ్యేలా ఏర్పాట్లు చేయాలి.
- 18న అన్ని జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలి. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులందరినీ ఆహ్వానించాలన్నారు.
- అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ మరియు వాణిజ్య సంస్థలను 15వ తేదీ నుండి విధ్యుత్ దీపాలతో అలంకరించాలి.
ఈ వీడియోకాన్ఫరెన్స్ లో అదనపు డీజీపీ జితేందర్, జీఏడీ కార్యదర్శి శేషాద్రి, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జోంగ్తు, పీఆర్ అండ్ ఆర్డీ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, టీఆర్ అండ్ బి శ్రీనివాసరాజు, రవాణా కమీషనర్ జ్యోతి బుద్ధ ప్రకాశ్, సాంకేతిక విద్యాశాఖ కమీషనర్ నవీన్ మిట్టల్, ఆర్థిక శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమీషనర్ ఓమర్ జలీల్, డైరెక్టర్ పీఆర్ అండ్ ఆర్డీ హనుమంతరావు, డైరెక్టర్ ఐ అండ్ పీఆర్ రాజమౌళి, డైరెక్టర్ ఆఫ్ కల్చర్ మామిడి హరికృష్ణ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY