గతకొన్ని రోజులుగా రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా త్వరలోనే బాధ్యతలు స్వీకరించబోతున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై ఇటీవల ప్రభుత్వంలోని కొందరు మంత్రులు, టీఆర్ఎస్ పార్టీ కీలక నాయకులు కూడా స్పందిస్తూ మంత్రి కేటీఆర్ కు సీఎం అయ్యేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో గురువారం నాడు మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సికింద్రాబాద్లో నూతనంగా నిర్మించిన దక్షిణ మధ్య రైల్వే ఉద్యోగుల సంఘ్ డివిజనల్ కార్యాలయాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, మంత్రులు వి.శ్రీనివాస్ గౌడ్, పువ్వాడ అజయ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ పద్మారావు మాట్లాడుతూ అతి త్వరలో కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ కు కంగ్రాట్స్ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్కు శాసనసభ, రైల్వే కార్మికుల తరపున శుభాకాంక్షలు తెలుపుతున్నాను, సీఎం అయ్యాక రైల్వే ఉద్యోగులను కాపాడాలని ఆకాంక్షిస్తున్నాను అని పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ సమక్షంలోనే డిప్యూటీ స్పీకర్ పద్మారావు ఈ వ్యాఖ్యలు చేయడంతో త్వరలో మంత్రి కేటీఆర్ సీఎం కాబోతున్నారనే వాదనకు మరింత బలం చేకూరుతుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ