తెలంగాణ రాష్ట్రంలో వివిధ వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వ హించాల్సిన పలు ఉమ్మడి ప్రవేశ పరీక్షల దరఖాస్తుల స్వీకరణ గడువును ఏప్రిల్ 20 వ తేదీవరకు పొడిగిస్తునట్టు రాష్ట్ర ఉన్నత విద్యామండలి వెల్లడించింది. కోవిడ్-19 (కరోనా వైరస్) నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు 21 రోజుల పాటుగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో దరఖాస్తు స్వీకరణ గడువు పొడిగిస్తునట్టు మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. ఎంసెట్, ఈసెట్, పీజీఈసెట్, పీఈసెట్, లాసెట్, పీజీలాసెట్, ఎడ్సెట్ వంటి ఉమ్మడి పరీక్షల దరఖాస్తుల గడువును పొడిగించినట్లు వెల్లడించారు. ఐసెట్ దరఖాస్తుల స్వీకరణ గడువు మాత్రం ఏప్రిల్ 30 వ తేదీ వరకు ఉన్నట్లు పేర్కొన్నారు. మరోవైపు మే నెల 2 వ తేదీన నిర్వహించాల్సిన ఈసెట్, అలాగే 4, 5, 7, 9, 11 తేదీల్లో నిర్వహించాల్సిన ఎంసెట్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు.
[subscribe]