మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఇటీవల ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయి పార్టీలో చేరికపై చర్చించిన సంగతి తెలిసిందే. కాగా ఢిల్లీ పర్యటనను ముగించుకొని గురువారం నాడు ఈటల రాజేందర్ హైదరాబాద్ చేరుకున్నారు. ఈటల రాకతో శామీర్ పేట్ లోని ఆయన ఇంటి వద్దకు అభిమానులు భారీగా చేరుకున్నారు.
మరోవైపు జూన్ 4న టీఆర్ఎస్ పార్టీకి, హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ రాజీనామా చేయనున్నట్లు తెలుస్తుంది. మీడియా సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణపై ప్రకటన చేయనున్నారని, అలాగే బీజేపీలో చేరికపై కూడా స్పష్టత ఇచ్చి, కీలక ప్రకటన చేసే అవకాశమునట్టు సమాచారం. ముందుగా భూ ఆక్రమణ ఆరోపణలు రావడం, తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గం నుంచి తొలగింపుతో టీఆర్ఎస్ పార్టీతో ఆయనకు దూరం పెరిగిన సంగతి తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ