తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు పీవీ శత జయంతి వేడుకల కమిటీ చైర్మన్, రాజ్యసభ ఎంపీ కె.కేశవరావు తెలిపారు. గురువారం నాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఉత్సవ కమిటీ సభ్యులుగా ఉన్న ఎమ్మెల్సీ వాణి దేవి, చంద్రశేఖర్, రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, హెచ్ఎండిఏ మెట్రోపాలిటన్ కమిషనర్ అర్వింద్ కుమార్, రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణలతో కలిసి నెక్లెస్ రోడ్డును కేశవరావు సందర్శించారు.
ఈనెల 28న పీవీ నరసింహారావు శత జయంతిని పురస్కరించుకుని నెక్లెస్ రోడ్డు నందు పీవీ నరసింహారావు విగ్రహాన్ని ఏర్పాటు చేయుటకు అనువైన వివిధ స్థలాలను పరిశీలించారు. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు ముగింపు వేడుకలను నిర్వహించనున్నట్లు కేశవరావు తెలిపారు. మరోవైపు నెక్లెస్ రోడ్డును పీవీ నరసింహారావు మార్గ్ గా మార్చుతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ