ఓల్డ్ మలక్పేట డివిజన్ లో రీపోలింగ్ ముగియడంతో జీహెచ్ఎంసీ ఎన్నికలకు పోలింగ్ పక్రియ పూర్తయింది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలకు సంబంధించి సాయంత్రం ఆరు గంటల తర్వాత పలు సంస్థల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. ఎగ్జిట్ పోల్స్ ఎక్కువగా టిఆర్ఎస్ పార్టీవైపే మొగ్గుచూపాయి. అత్యధిక డివిజన్లు గెలుచుకుని మరోసారి కూడా బల్దియా మేయర్ పీఠాన్ని టిఆర్ఎస్ పార్టీ దక్కించుకుంటుందని అంచనా వేశాయి.
ఎగ్జిట్ పోల్స్ వివరాలు:
ఆరా సంస్థ:
- టిఆర్ఎస్ – 78 (+/-7) – ఓట్ల శాతం 40.08 (+/-3%)
- బీజేపీ – 28 (+/-5) – ఓట్ల శాతం 31.21 (+/-3%)
- ఏఐఎంఐఎం – 41 (+/-5) – ఓట్ల శాతం 31.21 (+/-3%)
- కాంగ్రెస్ – 03 (+/-3) – ఓట్ల శాతం 8.58 (+/-3%)
- ఇతరులు – 00 (–) – ఓట్ల శాతం 7.70 (+/-3%)
పీపుల్స్ పల్స్ సంస్థ:
- టిఆర్ఎస్: 68 -78
- బీజేపీ: 25-35
- ఏఐఎంఐఎం: 38-42
- కాంగ్రెస్: 1-5
- ఇతరులు: 0
థర్డ్ విజన్ సంస్థ:
- టిఆర్ఎస్: 95-101
- ఏఐఎంఐఎం: 35-38
- బీజేపీ: 5-12
- కాంగ్రెస్: 0-1
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ