ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. డిసెంబర్ 3, గురువారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,70,076 కు, మరణాల సంఖ్య 7014 కు చేరుకుంది. గత 24 గంటల్లో (9AM-9AM) 63,049 కరోనా పరీక్షలు నిర్వహించగా 664 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో కరోనా వలన మరో 11 మంది మరణించారు.
రాష్ట్రంలో కరోనా వలన కృష్ణా జిల్లాలో ఇద్దరు, చిత్తూరులో ఇద్దరు, విశాఖపట్నంలో ఒకరు, అనంతపూర్ లో ఒకరు, కడపలో ఒకరు, నెల్లూరులో ఒకరు, ప్రకాశంలో ఒకరు, విజయనగరంలో ఒకరు మరియు పశ్చిమగోదావరిలో ఒకరు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 7014 కి చేరింది. ఇక నమోదైన మొత్తం కేసుల్లో 8,56,320 మంది కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడగా, గత 24 గంటల్లో 835 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 7014 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ