బెట్టింగ్‌లో పడిపోయిన అధికార పార్టీ గ్రాఫ్

Graph of ruling party falling in betting,Graph of ruling party,Falling in betting,Ruling party falling,BRS Graph falling in betting, Polling ,Telangana Elections 2023,Telangana election campaign,campaign is over, votes,assembly seat, BJP,BRS, Congress,Mango News,Mango News Telugu,Assembly Elections 2023 highlights,Telangana Politics,Telangana Assembly polls,Telangana Elections 2023,Telangana Elections Latest News,Telangana Elections Latest Updates,Ruling party News Today,Ruling party Graph Latest News
BRS Graph falling in betting, Polling ,Telangana Elections 2023,Telangana election campaign,campaign is over, votes,assembly seat, BJP,BRS, Congress

తెలంగాణలో ఈ సారి టఫ్ ఫైట్ ఉండటంతో.. గెలుపుపై విశ్లేషకులు కూడా అంచనా వేయలేకపోతున్నారు. మళ్లీ బీఆర్ఎస్ వస్తుందని కొందరంటే .. కేసీఆర్ ప్రభుత్వంతో  విసిగిపోయిన జనాలు ప్రత్యామ్నాయ ప్రభుత్వం కోసం చూస్తున్నారని మరికొంతమంది అంటున్నారు. అలాగే ఈ సారి తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకుంది పక్కాగా కాంగ్రెస్ పాగా వేసేస్తాదని కొంతమంది అంటే..ఇప్పటి వరకూ సీఎం సీటు కోసమే కొట్టుకుంటున్న పార్టీ నేతలు.. రేపు ప్రజలను ఏం పాలిస్తారంటూ.. అందుకే కాంగ్రెస్ రాదని మరికొంతమంది అంటున్నారు. మరోవైపు బీజేపీ అధికారంలోకి రాకపోయినా రెండు పార్టీలను బాగా దెబ్బకొట్టడంలో మాత్రం కీ రోల్ పోషిస్తుందని కొందరు అంటున్నారు.

దీంతో  ఓటరు నాడిని అంచనా వేయడానికి అంతా ఆసక్తి చూపిస్తున్నారు. ఓటరు నాడి ఎలా ఉందో.. పార్టీల మేనిఫెస్టోలు ఎంత వరకూ అమలు జరిగే అవకాశాలున్నాయో లెక్కలు వేస్తున్నారు. ఏ అభ్యర్థిని నమ్మి రేపు ఓటేయొచ్చన్న చర్చలు ఓవైపు .. ఏ  పార్టీ గెలిచి అధికారంలోకి వస్తుందన్న చర్చోపచర్చలు మరోవైపు తెలంగాణ రాజకీయాలను మరింత వేడెక్కిస్తున్నాయి.  ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్ధికి గెలిచే అవకాశాలున్నాయో ఫోన్‌లు చేసి మరీ ఎంక్వైరీలు చేస్తున్నారు. మరోవైపు సందిట్లో సడేమియాలా బెట్టింగ్‌లు కూడా షురూ అయిపోయాయి.   బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్‌పైనే ఎక్కువగా బెట్టింగ్‌లు  జరుగుతున్నట్లు తెలుస్తోంది.

నిజానికి ఎన్నికల సమయంలోనూ, క్రికెట్ టైమ్‌లోనూ  వాటి వేడి ఎలా ఉంటుందో బెట్టింగ్‌ల జోరు అంతేకంటే వేడిగా ఉంటుందన్న విషయం తెలిసిందే. అలా జోరుమీదున్న తెలంగాణ ఎన్నికల కోసం జరుగుతున్న బెట్టింగ్‌లో..ఈ సారి  అధికార పార్టీకి గ్రాఫ్ బాగా తగ్గిపోయింది. రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్, గోవా కేంద్రంగా నడుస్తున్న బెట్టింగ్ దందాలో.. నెల రోజులుగా 66 అధికార పార్టీకి  ఎస్ , నో  ఇవ్వగా తాజాగా ఈ రోజు 51 ఎస్,  నో  గా ఇచ్చారు.

అంటే బెట్టింగ్ దునియాలో.. సుమారు నెల రోజులలోనే బీఆర్ఎస్  పార్టీకి 15 సీట్లు  తగ్గినట్లు తెలుస్తోంది. దీంతో ఈ బెట్టింగ్ రేట్‌కు కేవలం డబల్ మాత్రమే ఇస్తున్నారు. అంటే 51 – ఎస్ అని రూ. లక్ష బెట్టింగ్‌లో పెడితే బీఆర్‌ఎస్‌కు  51  కానీ..దానిపైన  ఎక్కువ సీట్లు  వచ్చినా కూడా రూ. లక్షకు రూ. లక్ష వస్తాయి. 51 కంటే తక్కువ వస్తే మాత్రం రూ. లక్ష పోతాయి.

ఇలా  ప్రత్యేక సర్వేలతో పాటు, వివిధ ఇతర సంస్థల సర్వేల ఆధారంగా సేకరించిన అంశాలపై  ఉత్తరాది బెట్టింగ్ మాఫియా.. విశ్లేషణ నిర్వహించి మరీ బెట్టింగ్ ఫిగర్‌ను విడుదల చేస్తుందట. అయితే  కామారెడ్డి, గజ్వేల్, కరీంనగర్, సిరిసిల్ల  మీద బెట్టింగ్‌లు ఎక్కువగా జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే డిసెంబర్ 3 లోపు బెట్టింగ్‌ల జోరు మరింత పెరిగే అవకాశాలున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీపై వ్యతిరేకత పెరిగిపోయిందని అందుకే బెట్టింగ్‌లో బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోయిందని విశ్లేషకులు  అంటున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + three =