తెలంగాణ రాష్ట్రంలో మే 7 వరకు లాక్డౌన్ పొడిగిస్తూ తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్(సీపీ) అంజనీకుమార్ ఈ రోజు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్డౌన్ పొడిగింపుపై పోలీసు ఉన్నతాధికారులతో చర్చించామని, ఇకపై రాష్ట్రంలో లాక్డౌన్ను మరింత కఠినంగా అమలుచేస్తామని చెప్పారు. ప్రజలంతా నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని, వాహనాలతో రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇప్పటికే 69,288 వాహనాలను సీజ్ చేశామని, నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడపవద్దని సూచించారు. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలపై ఆంక్షలు విధించామని, వాటిని అతిక్రమిస్తే వాహనాలను సీజ్ చేయడంతో పాటు చర్యలు తప్పవని హెచ్చరించారు.
రాష్ట్రంలో కరోనా కంటైన్మెంట్ ప్రాంతాల్లో 12 వేల మంది పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారని, వారికోసం ప్రత్యేకంగా పీపీఈ కిట్లు అందించామని పేర్కొన్నారు. పాస్ల కోసం ఎవరూ కమిషనర్ కార్యాలయానికి రావొద్దని, ఆన్లైన్లోనే పాస్ల కోసం ఓ పోర్టల్ను ప్రారంభించామని అందులోనే దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. అత్యవసర సేవల కోసం ఇవ్వబడిన పాసులను ఎవరైనా దుర్వినియోగం చేస్తే వాటిని రద్దు చేయడమే కాకుండా వాహనాన్ని కూడా సీజ్ చేస్తామని తెలిపారు. సామూహిక మత ప్రార్థనలకు అనుమతి లేకపోవడంతో అన్నిమతాల వారు ఇళ్లలోనే పండుగలను జరుపుకోవాలని సీపీ అంజనీకుమార్ కోరారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu
[subscribe]