కేంద్ర వైద్య శాఖ సహాయమంత్రి అశ్విని కుమార్ చౌబే తో ఏప్రిల్ 20, సోమవారం నాడు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఫోన్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్రమంత్రికి మంత్రి ఈటల రాజేందర్ మూడు విజ్ఞప్తులు చేశారు. 1000 వెంటిలేటర్స్ కోసం ఇప్పటికే విజ్ఞప్తి చేసినా ఇంకా రాలేదు అని వెంటనే అందజేయాలని కోరారు. గచ్చిబౌలిలో తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ (టిమ్స్) 1500 పడకల ఆసుపత్రి ప్రారంభం అయింది కాబట్టి వెంటిలేటర్స్ అవసరం ఉందని మంత్రి తెలిపారు.
అలాగే హెఛ్సీఎల్ నుంచి పీపీఈ కిట్స్, ఎన్-95 మాస్క్ లు అందిస్తామని కేంద్రం తెలిపిందని, కానీ తగినంత రావడం లేదని, వెంటనే చొరవ తీసుకోవాలని ఎక్కువ మొత్తంలో అందజేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పీపీఈ కిట్స్, ఎన్-95 మాస్క్ లు పెద్ద ఎత్తున సేకరిస్తుంది కానీ ఎక్కువ ధరకు కొనవలసి వస్తుందని, అదే కేంద్రప్రభుత్వం అందిస్తే రాష్ట్రంపై భారం తగ్గుతుందని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu
[subscribe]