తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో పలువురు ఎమ్మెల్యేలు, పార్టీల కీలక నాయకులు సైతం కరోనా వైరస్ బారినపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరో ఎమ్మెల్యేకి కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్కు కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ రోజు అసెంబ్లీ సమావేశాలకు వెళ్లిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అక్కడ కరోనా పరీక్షలు చేయించుకోగా ఫలితం పాజిటివ్ గా వచ్చింది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్లోనే ఐసోలేషన్లో ఉన్నారు. మరోవైపు గత కొన్ని రోజులుగా తనను కలిసిన అధికారులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు అందరిని కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. తనను కలిసిన వారు ఇతరులతో వేరుగా ఉండి నిబంధనలు పాటించాలని ఎమ్మెల్యే సంజయ్ విజ్ఞప్తి చేశారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu