తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమా కోహ్లీ గురువారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమా కోహ్లీ చేత రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, పలువురు న్యాయమూర్తులు, పలువురు రాష్ట్ర మంత్రులు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ హైకోర్టుకు తోలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమా కోహ్లీ గుర్తింపు పొందారు. ప్రమాణ స్వీకారం అనంతరం జస్టిస్ హిమా కోహ్లీకి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం కేసీఆర్ పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇప్పటివరకు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించిన జస్టిస్ హిమా కోహ్లి ఇటీవలే తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ