తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు వైద్య శిబిరాలలో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 23 లక్షల 22 వేల 198 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. కంటి వెలుగు కార్యక్రమములో మొత్తం నేటి (ఫిబ్రవరి 3, శుక్రవారం) వరకు 4 లక్షల 96 వేల 654 మందికి కంటి అద్దాలు ఇవ్వడం జరిగింది. ఈ మేరకు కంటి వెలుగు కార్యక్రమ తాజా వివరాలతో ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది.
కంటి వెలుగు (2023, ఫిబ్రవరి 3న):
- కంటి పరీక్షలు: 2,08,480 మంది
- రీడింగ్ గ్లాసెస్ పంపిణీ: 34,213
- ప్రిస్కిప్షన్ గ్లాసెస్ కోసం రెఫర్: 23,142
- కంటి సమస్యలు లేనివారు: 1,51,117 మంది
కంటివెలుగులో ఇప్పటివరకు (2023, ఫిబ్రవరి 3) మొత్తం వివరాలు:
- మొత్తం కంటిపరీక్షలు: 23,22,198 మంది
- మొత్తం రీడింగ్ గ్లాసెస్ పంపిణీ: 4,96,654
- మొత్తం ప్రిస్కిప్షన్ గ్లాసెస్ కోసం రెఫర్: 3,40,152
- కంటి సమస్యలు లేనివారు: 14,85,238 మంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE