తెలంగాణలో గ్రూప్-4 పోస్టుల ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. శుక్రవారం సాయంత్రం గం.5తో గడువు ముగియగా.. మోత, 9,51,321 దరఖాస్తులు వచ్చాయి. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ప్రకటించింది. ఇక గ్రూప్-4 సర్వీసుల కోసం రాష్ట్రంలో మొత్తం 8,180 పోస్టులు భర్తీ చేయనుండగా.. జులై 1న రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఈసారి వచ్చిన మొత్తం దరఖాస్తులను పరిశీలిస్తే.. ఒక్కో పోస్టుకు సగటున దాదాపు 116 మంది పోటీ పడుతున్నారు. కాగా టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించే పరీక్షలకు ఇంత భారీగా దరఖాస్తులు రావడం ఇది రెండోసారి. ఇంతకుముందు 2018లో నిర్వహించిన 700 వీఆర్వో పోస్టుల భర్తీకి గరిష్టంగా 10.58 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇక టీఎస్పీఎస్సీ తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలోని 581 వసతిగృహ సంక్షేమాధికారుల పోస్టులకు 1,45,358 మంది దరఖాస్తులు వచ్చాయి. దీనికి సంబంధించిన రాత పరీక్ష ఆగస్టులో నిర్వహించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE