తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి లేఖ రాశారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన గొప్ప, విభిన్న సంస్కృతులను పెద్ద ఎత్తున ప్రోత్సహించి, విస్తృతమైన ప్రచారం కల్పించటానికి వీలుగా కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేయనున్న సంగీతనాటక అకాడెమీ ప్రాంతీయ కేంద్రానికి 10 ఎకరాల భూమిని కేటాయించాలని సీఎం కేసీఆర్ ను లేఖలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు. సంగీతం, జానపద మరియు గిరిజన కళలతో కూడిన తెలంగాణ యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని సంగీతనాటక అకాడెమీ ప్రత్యేకంగా ప్రచారం చేస్తుందని కిషన్ రెడ్డి తెలిపారు. సీఎం సహకారం కోసం ఎదురు చూస్తున్నానని, వెంటనే పని ప్రారంభించవచ్చుని పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ కు రాసిన లేఖను జత చేస్తూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు.
Wrote to Telangana CM KCR to provide land for @MinOfCultureGoI to set up a dedicated Regional Centre of @sangeetnatak.
SNA will specifically promote Telangana’s rich cultural heritage of music, folk & tribal arts.
I look forward to his co-operation so work can start immediately pic.twitter.com/CbKvCgBG5d
— G Kishan Reddy (@kishanreddybjp) March 15, 2023
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE