రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నిబందనల వలన మే 12, 2021 నుండి మే 21, 2021 తేది వరకు మండల కార్యాలయాలలో జాయింట్ సబ్ రిజిస్టార్ లుగా వ్యవహరిస్తున్న తహసీల్దార్ల వద్ద ధరణి ద్వారా నిర్వహించే భూముల రిజిస్ట్రేషన్లు, ఇతర లావాదేవీలు జరుగవని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి/సిసిఎల్ఎ సోమేశ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. అయితే మే 12 నుండి 21 వరకు రిజిస్ట్రేషన్ల కోసం ధరణి ద్వారా స్లాట్ లు బుక్ చేసుకున్న వారి స్లాట్ లను రీషెడ్యూల్ చేయనున్నట్లు తెలిపారు. స్లాట్ ల బుకింగ్ కై చెల్లించిన రిజిస్ట్రేషన్ ఫీజులు, ఇతర చార్జీలు చెల్లుబాటు అవుతాయని, రీషెడ్యూల్ సమయంలో వాటిని జమ చేయనున్నట్లు తెలిపారు.
లాక్డౌన్ నిబందనల మినహాయింపు కార్యక్రమాలలో ధరణి లావాదేవీలు లేవని సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. ధరణి ద్వారా రిజిస్ట్రేషన్లకు కొనుగోలుదారు, అమ్మకం దారుతో పాటు ఇద్దరు సాక్షులు కలిపి మొత్తం నలుగురు వ్యక్తులైన హాజరు కావాల్సివుంటుందని తెలిపారు. తద్వారా మండల కార్యాలయాలలో రద్దీ పెరుగుతుందని, కోవిడ్ నిబంధనల అమలు సాద్యపడదని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ