తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా మే 12, బుధవారం రాత్రి 9 గంటల వరకు 43,74,351 మంది లబ్ధిదారులకు మొదటి డోసు, 10,65,362 మంది లబ్ధిదారులకు రెండవ డోసు కలిపి మొత్తం 54,39,713 కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. కాగా బుధవారం నాడు 657 మందికి మొదటి డోస్, 33,438 మందికి రెండో డోస్ కరోనా వ్యాక్సిన్ వేసినట్లు పేర్కొన్నారు.
మరోవైపు రాష్ట్రానికి ఇంతవరకు 55,52,360 కరోనా వ్యాక్సిన్ డోసులు అందించగా, 54,39,713 వ్యాక్సిన్ డోసులను లబ్దిదారులకు వినియోగించినట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. 62,970 వ్యాక్సిన్ డోసులు ఆర్మీ దళాలకు అందజేసినట్టు తెలిపారు. అలాగే 0.90 శాతం వ్యాక్సిన్ వృధా జరిగినట్టు ప్రకటించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ