“మహాత్మా జ్యోతిబాపూలే బీసీ ఓవర్సీస్ విద్యా నిధి” పథకం కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ వారం రోజులు పొడిగించామని బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా, మార్చి 8వ తేదీ తుది గడువు అని తెలిపారు. ఈ పథకం ద్వారా ఎంపికైన బీసీ విద్యార్థులు విదేశాల్లో చదివేందుకు తెలంగాణ ప్రభుత్వం రూ.20 లక్షల ఆర్థిక సహాయాన్నిఅందిస్తోందని, విద్యార్థులు వీసా, పాస్పోర్ట్ కాపీతో పాటు, ఆధార్కార్డు, స్థానికత, కుల, ఆదాయ, ఇతర అవసరమైన అన్ని సర్టిఫికేట్లను జత చేస్తూ https://telanganaepass.cgg.gov.inలో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ప్రకటనలో పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE