మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి పనులపై మంత్రి జగదీష్ రెడ్డి కీలక సమీక్ష

Minister Jagadish Reddy held Review on Munugode Constituency Development Works,Minister Jagadish Reddy held Review,Jagadish Reddy on Munugode Constituency,Munugode Constituency Development Works,Mango News,Mango News Telugu, Telangna Congress Party, Telangna BJP Party,YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,Hyderabad News,Telangana News,Telangana Chief Minister Kcr,Telangana Cm Kcr,Telangana Cm Kcr Twitter Live Updates,Telangana Cm Party,Telangana State Cm Kcr,Farmers Telangana Cm Kcr,Ktr Latest News,Kalavakuntla Kavitha News,Telangana State Welfare Schemes, Telangana State Governer,TPCC Chief Revanth Reddy, Telangana BJP Chief Bandi Sanjay KUmar, YSRTP Cheief YS Sharmila

మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి పనులపై బుధవారం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు ప్రభాకర్ రెడ్డి, గాధరి కిశోర్ కుమార్, చిరుమర్తి లింగయ్య, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్ అజయ్ కుమార్, రెవిన్యూ అదనపు కలెక్టర్ భాస్కర్, ఈఈ రాములు, జిల్లా నీటిపారుదల అధికారి ప్రభు కళ్యాణ్, తదితరులు పాల్గొన్నారు. మునుగోడు నియోజకవర్గ పరిధిలో మొదలుపెట్టిన నీటిపారుదల పనులను వేగవంతం చేయాలని ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అందుకు సంబంధించిన భూసేకరణ లో అలసత్వం చూపొద్దని ఆయన అధికారులకు సూచించారు.

మునుగోడు నియోజకవర్గ పరిధిలో నీటిపారుదల శాఖ చేపట్టిన శివన్న గూడెం ప్రాజెక్ట్ కు సంబంధించిన ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీతో పాటు, లక్ష్మణపురం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, శశిలేటి వాగు ఫిడర్ చానల్ కు సంబంధించిన భూసేకరణ మరియు నిర్మాణపు పనులు, వెలిమకన్నే, బెందలమ్మ చెరువు, సోలిపురం బ్రిడ్జి,చెక్ డ్యామ్ లు, చౌటుప్పల్ లోని మిని ట్యాంక్ బండ్ నిర్మాణాల పురోగతిపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ శివన్న గూడెం, లక్ష్మణపురం ప్రాజెక్ట్ ల నిర్వాసితులకు తక్షణం ప్లాట్లు మంజూరు చేయాలని ఆదేశించారు. అందుకు సంబంధించిన పేపర్ వర్క్ ను వేగిరపరచాలని చెప్పారు.

అదే విదంగా శశిలేటి వాగు ఫిడర్ కు సంబంధించిన పనులను వేగవంతం చెయ్యడంతో పాటు అందుకు సంబంధించిన భూసేకరణ ను పూర్తి చేయాలన్నారు. ఇటీవల మునుగోడు ఉప ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సోలిపురం బ్రిడ్జి నిర్మాణపు పనులను ప్రారంభించడంతో పాటు పెండింగ్ లో ఉన్న చౌటుప్పల్ మినీ ట్యాంక్ బండ్ నిర్మాణపు పనులు పూర్తి చేయాలన్నారు. ఇప్పటికే మినీ ట్యాంక్ బండ్ నిర్మాణపు పనులు చేపట్టి పూర్తి చెయ్యలేకపోయిన సదరు కాంట్రాక్టర్ కు నోటీస్ ఇచ్చి పక్కకు తప్పించి మరొకరితో పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలంటూ మంత్రి జగదీష్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + eight =