నల్లగొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రధాన పార్టీలు ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చిన్న పార్టీలు కూడా తమ ఉనికిని చాటుకునే ప్రయత్నాలు మొదలెట్టాయి. దీనిలో భాగంగా బహుజన్ సమాజ్వాదీ పార్టీ (బీఎస్పీ) పార్టీ కూడా మునుగోడు ఉపఎన్నికలో పోటీ చేసేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. ఆందోజు శంకరా చారిని తమ అభ్యర్ధిగా ప్రకటించారు.
It’s official now. Mr Andoju Shankara Chary is #BSP Candidate for 93-Munugode By-election. We all wish him the very best. మునుగోడు ఉప ఎన్నికకు #BSP అభ్యర్థిగా ఎంపికైన ఉన్నత విలువలున్న యువనాయకుడు శ్రీ. ఆందోజు శంకరాచారి గారికి హృదయపూర్వక అభినందనలు. కలుద్దాం-నిలుద్దాం-గెలుద్దాం.✊🐘 pic.twitter.com/741Hu7Hywi
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) October 8, 2022
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాన పార్టీలన్నీ అగ్ర సామాజికవర్గ నేతలకు టికెట్లు కేటాయించాయని, కానీ తాము మాత్రం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ప్రాధాన్యతనిస్తూ ఓబీసీ వర్గానికి చెందిన అభ్యర్థిని నిలబెడుతున్నామని తెలిపారు. ఆందోజు శంకరా చారి.. నియోజకవర్గంలోని నారాయణపూర్ మండలం జనగాం గ్రామానికి చెందిన వ్యక్తి అని, ఉన్నత విలువలున్న యువనాయకుడని ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. కాగా గత కొద్ది రోజులుగా నియోజకవర్గంలోనే మకాం వేసిన ఆయన బీఎస్పీ అభ్యర్థిని గెలిపించాల్సిందిగా ప్రజలను కోరుతున్నారు. తాజాగా అభ్యర్థి ప్రకటనతో ఆయన ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయనున్నారు. ఇక రాజకీయాల్లోకి అడుగిడిన తర్వాత ప్రవీణ్ కుమార్ ఎదుర్కొనబోతున్న తొలి ఎన్నిక ఇదే కావడం విశేషం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY