తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఫ్లోరోసిస్ బాధితుడు అంశాల స్వామి మృతి చెందారు. 32 ఏళ్ల స్వామి మృతి పట్ల రాష్ట్ర మంత్రి కేటీ రామారావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మర్రిగూడ మండలం శివన్న గూడేనికి చెందిన స్వామి శుక్రవారం సాయంత్రం ప్రమాదవశాత్తు ట్రై సైకిల్ పైనుంచి కిందపడ్డారు. ఈ క్రమంలో ఆయన తలకు బలమైన గాయం కావడంతో ఇంటివద్దే చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శనివారం ఉదయం మృతి చెందారు. విషయం తెలిసిన మంత్రి కేటీఆర్ ఈ మేరకు ట్విట్టర్ వేదికగా అంశాల స్వామి మృతికి సంతాపం ప్రకటించారు. ‘స్వామి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఫ్లోరోసిస్ బాధితుడైన స్వామి ఫ్లోరైడ్ నివారణ, బాధితులకు అవిశ్రాంతంగా పోరాడిన గొప్ప యోధుడు. ఆయన ఎంతో మందికి ప్రేరణగా నిలిచారు. స్వామి ఎప్పటికీ నా హృదయానికి దగ్గరగా ఉంటాడు. అతని ఆత్మకు శాంతి చేకూరాలి’ అని ట్వీట్ చేశారు.
My Heartfelt condolences to the family of Sri Amshala Swamy Garu who passed away today
He was a fighter who championed the cause of Fluorosis victims & an inspiration to many. He will always remain close to my heart
May his soul rest in peace 🙏 pic.twitter.com/wCv5DHWeGg
— KTR (@KTRBRS) January 28, 2023
కాగా అంశాల స్వామి చిన్నతనంలోనే ఫ్లోరోసిస్ బారిన పడ్డారు. దీంతో మహమ్మారిని పారద్రోలడానికి నిరంతరం కృషి చేశారు. ఎంతోమంది ఫ్లోరైడ్ బాధితులకు స్ఫూర్తిగా నిలిచారు. ఇక గతేడాది అక్టోబర్ 13న మునుగోడు ఉపఎన్నిక నామినేషన్ల సందర్భంగా చండూరు వెళ్లిన మంత్రి కేటీఆర్ శివన్నగూడెంలోని స్వామి ఇంటికి వెళ్లి ఆయనతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా స్వామి కుటుంబ ఆర్ధిక పరిస్థితి తెలుసుకొని వ్యక్తిగతంగా ఆర్థిక సహాయం అందించారు. అంతకుముందే స్వామి జీవనోపాధి కోసం సెలూన్ ఏర్పాటు చేయించిన మంత్రి ప్రభుత్వం తరపున డబుల్ బెడ్రూం ఇల్లు కూడా కట్టించిన సంగతి తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE